Header Banner

పాకిస్థాన్ లో ట్రెండింగ్ లో రాహుల్ గాంధీ! కారణం ఇదే!

  Wed May 21, 2025 13:11        India

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు పాకిస్థాన్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా 'ఆపరేషన్ సిందూర్' గురించి ఆయన లేవనెత్తిన ప్రశ్నలను పాకిస్థాన్ మీడియా తమకు అనుకూలంగా మలచుకుంటూ కథనాలను ప్రసారం చేస్తోంది. ఈ పరిణామం భారత రాజకీయ వర్గాల్లోనూ, మాజీ సైనికాధికారుల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది.



గతంలో జరిగిన 'ఆపరేషన్ సిందూర్'ను ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ సోమవారం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. ఈ ఆపరేషన్ గురించి పాకిస్థాన్ ఆర్మీకి ముందే సమాచారం అందించారని ఆరోపిస్తూ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గతంలో మాట్లాడిన ఓ వీడియోను కూడా ఆయన పంచుకున్నారు. అంతేకాకుండా, ఈ ఆపరేషన్‌లో భారత్ ఎన్ని యుద్ధ విమానాలను కోల్పోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. సైనిక చర్యకు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే పాకిస్థాన్‌కి తెలియజేయడం నేరమని కూడా ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.



రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలను పాకిస్థాన్ మీడియా అందిపుచ్చుకుంది. 'ఆపరేషన్ సిందూర్' విఫలమైందని, ఈ ఆపరేషన్‌లో పాకిస్థాన్ భారత్‌ను ఓడించిందని ఆ దేశ మీడియా ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేసుకుంటోంది. భారత దాడుల్లో తమ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నప్పటికీ, వైమానిక రక్షణ వ్యవస్థలు దెబ్బతిన్నప్పటికీ, పాకిస్థాన్ మాత్రం తమ ఓటమిని అంగీకరించడం లేదు. పైగా, భారత్‌కు చెందిన ఐదు యుద్ధ విమానాలను, ముఖ్యంగా రాఫెల్ జెట్‌ను కూల్చివేశామని గొప్పలు చెప్పుకుంటోంది. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా భారత్ ఎన్ని యుద్ధ విమానాలను కోల్పోయిందని ప్రశ్నించడంతో, పాకిస్థాన్ మీడియాకు ఇది మరింత ఊతమిచ్చినట్లయింది. రాహుల్ ప్రశ్నలు తమ వాదనలకు బలం చేకూర్చేలా ఉన్నాయని భావిస్తూ, పాక్ మీడియా ప్రత్యేక చర్చా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది.

 


ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే వార్త.. కొత్తగా కేబుల్ బ్రిడ్జ్! ఈ రూట్ లోనే ఫిక్స్ - ఆ నేషనల్ హైవేకు దగ్గరగా.!

 


అయితే, రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇవి నిరాధారమైన ఆరోపణలని కొట్టిపారేసింది. 'ఆపరేషన్ సిందూర్'లో భాగంగా ఉగ్రవాద స్థావరాలను విజయవంతంగా ధ్వంసం చేసిన తర్వాత, పాకిస్థాన్ ఆర్మీ ప్రతిదాడికి దిగిన సందర్భంలోనే విదేశాంగ మంత్రి జైశంకర్ ఆ వ్యాఖ్యలు చేశారని విదేశాంగ శాఖ స్పష్టత ఇచ్చింది. "ఆపరేషన్ మొదలైన తర్వాత, మేము కేవలం ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని పాక్ ఆర్మీకి తెలియజేశాము. ఈ విషయంలో వారు జోక్యం చేసుకోవద్దని సూచించాము. కానీ, పాక్ ఆర్మీ మా సూచనను పాటించలేదు" అని జైశంకర్ చెప్పినట్లు విదేశాంగ శాఖ వివరించింది.



మరోవైపు, పలువురు మాజీ సైనికాధికారులు కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. ఒకవేళ దాడుల గురించి పాకిస్థాన్‌కు ముందే తెలిసి ఉంటే, మురిడ్కే, బహవల్పూర్ వంటి ప్రాంతాల్లోని ఉగ్రవాద శిబిరాల్లో ఉగ్రవాదులను ఎందుకు ఉంచుతారని వారు ప్రశ్నిస్తున్నారు. 'ఆపరేషన్ సిందూర్'లో వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమైన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. గతంలో అబోటాబాద్‌లో ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చిన తర్వాత అమెరికా కూడా పాకిస్థాన్‌కు సమాచారం అందించిందని, అలాగే 2019 బాలాకోట్ దాడుల అనంతరం కూడా భారత డీజీఎంఓ ఆపరేషన్ వివరాలను పాకిస్థాన్‌కు తెలియజేశారని, ఇది ఒక సాధారణ సైనిక ప్రక్రియ అని వారు విశ్లేషిస్తున్నారు. ఇటువంటి సున్నితమైన విషయాలపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వారు సూచిస్తున్నారు. 

 

ఇది కూడా చదవండి: ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

 అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ పై మంత్రివర్గ కీలక నిర్ణయాలు! ఇక నుండి ఇలా...!

 

 టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!

 

నేడు (21/5) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్..! వచ్చే నెల నుంచి ఆ రూల్ రద్దు?

 

 రేషన్ పంపిణీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! జూన్ నుంచి ఇలా..!

 

ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఆపరేషన్ వైసీపీ! నెక్స్ట్ వికెట్..!

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

వారిని అభినందించిన లోకేష్.. ఏపీలో విద్యాసంస్కరణలపై దేశ వ్యాప్తంగా..

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

ఎవ్వరూ మాట్లాడొద్దు..! లిక్కర్ స్కాంపై సీఎం ఆర్డర్స్!

 

ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లో భూసేకరణ! ఇక 8 గంటల్లో విశాఖ!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #RahulGandhi #PakistanTrending #TrendingNow #ViralNews #IndianPolitics